Monday 7 April 2014

అడవి బిడ్డలకు ఆపద్భాందవుడు

             వైద్య వృత్తిని అభ్యసించిన H. సుదర్శన్ కు ఏ మూలో అసంతృప్తి. నాటు వైద్యం తప్ప మరో దిక్కు లేని గిరిజనులకు తన సేవలు అందించాలని తపించాడు. ముప్పై ఏళ్ళ నుండి కర్నాటక  రామరాజ నగర జిల్లాలోని బిళగిరి రంగనహిల్స్ కు వచ్చి 150 గిరిజన గ్రామాలను అభివృద్ది పధం లో నడిపించారు.10 లక్షల మందికి వైద్యం అందించారు .
        అక్కడ 500 మంది పిల్లలకు విద్యనందిస్తున్నారు. కరుణ trust ను స్థాపించి  కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ ,అరుణాచల ప్రదేశ్ ,మేఘాలయ, అండమాన్, మణిపూర్  ప్రభుత్వాల సహకారంతో 50 హాస్పిటల్స్ ఏర్పాటు చేసారు.అబ్దుల్ కలాం,రాహుల్ గాంధీ ఆయన సేవను అభినందించారు ఈయన కృషికి గాను rightlivelyhood,పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.
వివరాలకు vgkk.org website ను సందర్శించండి . ఫోన్ :09448077487  

No comments:

Post a Comment