Wednesday 28 May 2014

ఉపాధి చూపించే "ఉన్నతి"

                         చదువుకోవటానికి తను పడ్డ కష్టం ఎవరు పడకూడదు అని BTECH చదివి వ్యాపారం చేసుకునే BANGALORE కు చెందిన రమేష్ కు అనిపించింది.10 సంవత్సరాల నుండి 3000 మంది విద్యార్థులను చదివించాడు.వారిలో చాలా మంది మధ్యలోనే బడి మానివేయటం మొదలు పెట్టారు.ఇలా లాభం లేదనుకుని బ్రతుకు తెరువు చూపించే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు .ఉద్యొగం లేకుండా ఖాళీగా ఉన్న వారందరికీ ఉన్నతి అనే ఈ సంస్థలో 70 రోజుల శిక్షణ ఇస్తారు.భోజనం వసతి అన్నీ ఉచితమే .ఇప్పటి వరకు 1800 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించారు.దాతలు ముందుకు వస్తే మరింత మందికి సహాయం చేస్తాను అంటున్నాడు రమేష్
ఈ వెబ్సైటు  లో వీరిని సంప్రదించండి . unnatiblr.org
ఫోన్:080-25384642
09844085864 

Monday 12 May 2014

బాలలకు భరోసా "దివ్యదిశ"

            పిల్లలు ఇల్లు వదిలి బయటకు పారిపోవటం అంటే వారికి ఆ  ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో కదా!పేదరికం ,బలవంతపు బాల్య వివాహం ,సవతి తల్లి సతాయింపు లాంటి ఇబ్బందులెన్నో! అమ్మ ,నాన్న కొట్టారని ,పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇంటినుంచి పారిపోతుంటారు.ఇలా వీదినపడ్డ బాల్యానికి రక్షణ కల్పించి దిశా నిర్దేశం చేసే వాళ్ళెవరు ?
          దివ్యదిశ అనే సంస్థను స్థాపించి ఇప్పటివరకు 10 లక్షల మంది బాలల జీవితాలను ప్రత్యక్షంగానో పరోక్షంగానో
ప్రభావితం చేసారు ఎసిడోర్ ఫిలిప్స్.ఎక్కడయినా  పిల్లలు అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి ఫోన్ చేయవచ్చు. హైదరాబాద్ లో ఈ సంస్థకి నాలుగు,మహబూబ్ నగర్ లో ఒకటి మెదక్ లో ఒకటి పునరావాస కేంద్రాలను ఈ సంస్థ నడుపుతుంది.గడప దాటే పిల్లలనే కాదు ఇంట్లో ఉంటూనే అభద్రతకు గురవుతున్న బాలలను రక్శించేందుకు హైదరాబాద్ లో 1098 అనే  helpline ను ఏర్పాటు చేసింది ఈ సంస్థ.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలకోసం tollfree number(18004253525) కు ఫోన్ చేయవచ్చు అలాంటి పిల్లల గురించి తెలిస్తే ఎవరయినా సమాచారాన్ని అందించవచ్చు.
( నేను  ఫిలిప్స్ గారి సెమినార్ కు ఒక సారి హాజరయి ఆయనతో మాట్లాడాను)
ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అను బంధం లోనిది వారికి ధన్యవాదాలు )
ఈ సంస్థ website ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి
divyadisha.org  

Monday 7 April 2014

అడవి బిడ్డలకు ఆపద్భాందవుడు

             వైద్య వృత్తిని అభ్యసించిన H. సుదర్శన్ కు ఏ మూలో అసంతృప్తి. నాటు వైద్యం తప్ప మరో దిక్కు లేని గిరిజనులకు తన సేవలు అందించాలని తపించాడు. ముప్పై ఏళ్ళ నుండి కర్నాటక  రామరాజ నగర జిల్లాలోని బిళగిరి రంగనహిల్స్ కు వచ్చి 150 గిరిజన గ్రామాలను అభివృద్ది పధం లో నడిపించారు.10 లక్షల మందికి వైద్యం అందించారు .
        అక్కడ 500 మంది పిల్లలకు విద్యనందిస్తున్నారు. కరుణ trust ను స్థాపించి  కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ ,అరుణాచల ప్రదేశ్ ,మేఘాలయ, అండమాన్, మణిపూర్  ప్రభుత్వాల సహకారంతో 50 హాస్పిటల్స్ ఏర్పాటు చేసారు.అబ్దుల్ కలాం,రాహుల్ గాంధీ ఆయన సేవను అభినందించారు ఈయన కృషికి గాను rightlivelyhood,పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.
వివరాలకు vgkk.org website ను సందర్శించండి . ఫోన్ :09448077487  

Tuesday 1 April 2014

10 revolution

                సహాయం చేయటానికి ఎక్కువ డబ్బు  కావాలి మనమేమి చేస్తాములే అనుకుంటూ ఉంటాం.కాని ఎంత          చిన్న మొత్తంతో  నైనా సహాయం  వచ్చు అని మార్కాపూర్ లోని ideal&krishnachaithanya degree college  విద్యార్థులు  నిరూపించారు .ప్రతి నెల ప్రతి విద్యార్ధి 10 రూపాయల సహాయంతో నెలకొక  కార్యక్రమాన్ని చేస్తున్నారు  ఈ కార్యక్రమాన్ని నాగమురళి ,sk ఉస్మాన్ భాషా అనే ఇద్దరు   lecturers ఆధ్వర్యంలో రామస్వామి , మహేష్ ,ప్రియాంక,దుర్గ,నవీన్, చంద్రశేఖర్,రసూల్, ప్రసన్న , ఫరూక్ ల నాయకత్వం లో ideal students activity cell బ్యానర్ క్రింద   ఇప్పటికి 8 సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
               ఇందులో రోగులకు పండ్లు పంచటం, అనాధలకు నిత్యావసరాలు  అందించటం నీలం  లక్ష రూపాయల నగదు 10 బస్తాల బియ్యము ,బట్టలు సేకరించి అందించటం,,విజయవాడ బుడమేరు ముంపు  బాధితులను ఆదు కోవటం,మానసిక వికలాంగులకు సహాయం చేయటం ,వ్రుధ్ధాశ్రమానికి ,బీద విద్యార్థులకు సహాయం చేయటం ప్రభు త్వ పాటశాలకు  విరాళం ఇవ్వటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తామెవరికి తీసిపోమనినిరూపిస్తున్నారు.    అన్ని విద్యా సంస్థలు వీరిని ఆదర్శంగా తీసు కుంటారని భావిద్దాము.            
IDEALACTIVITYCELL 

Monday 31 March 2014

S.C ,B.C HOSTELS లో 10 వతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

                S .C,B.C Hostels లోని 10 వ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్రారంభానికి ముందు ముఖ్యమైన సబ్జక్ట్స్ అయిన maths,english ,physical  science లందు ముఖ్యమైన సూచనలు,సలహాలు ఇచ్చి పరీక్షలకు సంసిద్ధులను చేయటం జరిగింది . maths తరగతులు P.Anand,B.Uday kumar తీసుకున్నారు . ఆనంద్ అందరు విద్యార్థులకు తాను తయారుచేసిన material xerox చేసి అందించారు .physicalscience తరగతి లో నేను  వారికి సూచనలు చేసి material xerox చేసి అందించాను.english తరగతిని sivaprasad  తీసుకున్నారు వీరందరూ స్వచ్చందంగా ముందుకు  వచ్చి classes తీసుకున్నందుకు Friendsfoundation వారిని  అభినందిస్తుంది .   

Sunday 30 March 2014

సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము

వేసవి  రాగానే చల్లని  పానీయాల వైపు మనసు మళ్ళుతుంది.శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియం
 లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2)మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర  కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12  లభిస్తాయి.
3)సబ్జా నీరు: మహిళలకు అవసర మయ్యె పాలేట్,నియాసిన్,చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ ఇ అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4)పుచ్చకాయ : గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A   ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN  సూర్యరశ్మి లోని U.V  కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
5) తాటి ముంజలు :6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
6) నిమ్మరసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ
7)చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి .ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.
8) రాగి జావ: ఇది acidity ని తగ్గిస్తుంది.
       ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు .
(జనవిజ్ఞానవేదిక సౌజన్యంతో )

Friday 21 February 2014

S.C హాస్టల్ లో చదువు యొక్క విలువ పై సదస్సు

              Friendsfoundation ఆధ్వర్యంలో మరొక హాస్టల్ నందు  చదువు యొక్క విలువ పై అవగాహనా సదస్సు   జరిగింది.ఈ హాస్టల్ మార్కాపుర్ లోని  తర్లుపాడు రోడ్ నందు గల మున్సిపల్ పార్క్ కు దగ్గరలో ఉంది.దీనికి వార్డెన్ గా యోగిరామ్ గారు ఉన్నారు.వారి అనుమతితో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
          మానవ పరిణామ క్రమంలో మనిషి సాధించిన అద్బుత ఆవిష్కరణలను వివరిస్తూ మీరు కూడా ఏదో  సాదిం చటానికే ఈ భూమి పైకి వచ్చారని చెబుతూ బాగా  చదువుకుంటే వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ భవిష్యత్ లో ఏయే ఉద్యోగాలకు ఏయే చదువులు చదవాలో వివరించటం జరిగింది.విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విని ఇచ్చిన  సూచనలు వ్రాసుకున్నారు.మరల ఎప్పుడు వస్తారు అంటూ విద్యార్థులు,వార్డెన్ గారు అడగటం ఆనందం కలిగించింది.ఈ సారి వచ్చి అందరిని విడివిడిగా కలిసి వారి విద్యా ప్రగతిని తెలుసుకొని భవిష్యత్ సూచనలు తెలియజేస్తానని చెప్పాను.ఈ సదస్సునకు అనుమతి ఇచ్చిన వార్డెన్ యోగిరామ్ గారికి ధన్యవాదాలు. మీరు ఎప్పుడు వచ్చినా మీకు మా ఆహ్వానం ఉంటుందని  చెప్పారు.ఈ కార్యక్రమానికి మా అబ్బాయి స్నేహిత్,డిగ్రీ విద్యార్ధి లక్ష్మి నారాయణ సహకరించారు.
 రవిశేఖర్,వార్డెన్ యోగి రామ్ గారు



   

Sunday 16 February 2014

మానవత్వానికి ప్రతిరూపం

             ఆకలేస్తే పంచభక్ష్య పరమాన్నాలు తినే వాళ్ళు ఒక వైపు గంజి నీళ్ళతో సరి పెట్టుకునేవాళ్ళు ,పస్తులుండే వాళ్ళు మరికొందరు,లేదంటే అడుక్కునే వాళ్ళు ఇంకొందరు.
           మరి ఆకలిని తట్టుకోలేక అశుద్దాన్ని తినే వాళ్లుంటారా!స్విట్జర్లాండ్ లోని 5 నక్షత్రాల హోటల్ లోchef ఉద్యోగ మొచ్చిన ఓ యువకుడికి ఆ దృశ్యం కంట బడింది.అంతే ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆకలికి అల్లాడిపోయే వారికోసం అక్షయ సంస్థను స్థాపించాడు.అతనే మదురై కి చెందిన నారాయనన్ కృష్ణన్.2010 సంవత్సరానికి ఆయన CNN HERO  AWARD పొందారు.ఇంట్లో  వద్దన్నా వినలేదు.తల్లిదండ్రులకు తను వారికి అన్నం పెడుతున్న ప్పుడు వారు ఆశీర్వదించే దృశ్యం చూపించాడు.వారి మనసు కరిగి ఒప్పుకున్నారు.ఆ అశుద్డాన్ని తినే వ్యక్తీ కృతజ్ఞతతో తన చేతిని పట్టుకున్నప్పుడు కలిగిన ఆనందం తన జీవితంలో ఎప్పుడు కలగలేదన్నాడు.
              మొదట్లో 30 మందికి 3 పూటలా తనే వండి తిండి పెట్టే వాడు ప్రస్తుతం అక్షయ సంస్థ 425 మందికి ప్రతి రోజు భోజనం పెడుతుంది.వారంతా నిరాదరణకు గురయిన వారు,అసహాయులు,మానసిక  వికలాంగులు. భోజనం పెట్టడంతో పాటు వారి ఒంటి శుభ్రత,ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటారు. ప్రస్తుతం మదురై శివార్లలో మూడు న్నర ఎకరాల విస్తీర్ణంలో అక్షయ హోం నిర్మాణం జరుగుతుంది.వీరి చిత్త శుద్ధిని గమనించిన అమెరికాలోని ఉద్యో గులు అక్షయ USA సంస్థ ద్వారా విరాళాన్ని అందిస్తున్నాయి.వారందరినీ ఆ హోం లో చేర్చి సేవ లందించాలని కృష్ణన్ సంకల్పం.ఈ క్రింది website ను చూడండి
akshayatrust.org
ఫోన్ :09843319933

Saturday 8 February 2014

JOY OF GIVING( పంచు కోవడంలోని ఆనందం)

            కడుపు నింపుకోవడానికి చాలా ఆహారం కావాలి.కాని నలుగురితో పంచుకుని తింటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది.అందుకే మన ఇంట్లో అమ్మ అందరికి ఆహారం పెట్టి చివరగా మిగిలింది తను తింటుంది.పంచు కోవడం లో ఉన్న ఆనందాన్ని,ఈ మానవతా సూత్రాన్ని JOYOFGIVINGWEEK ప్రచారం చేస్తుంది.
         ఇవ్వడం అన్నది అన్ని సార్లు డబ్బు తో ముడిపడనక్కర్లేదు.మనకున్న నైపుణ్యం ,చిరునవ్వు ఓ చికిత్స,ఓ బొమ్మ గీసి ఇవ్వటం,ఓ కచేరీ,ఓ పూట భోజనం,మూలన పడున్నపాదరక్షలు,మిగిలిన అన్నం వాడి పడేసిన బట్టలు
పుస్తకాలు ఏవైయినా కావచ్చు.ఏమి ఇస్తున్నాం అన్నది కాకుండా ఎంత ప్రేమగా ఇస్తున్నాం,అసలు ఇస్తున్నామా లేదా అన్నది ప్రధానం.ఇవ్వడం లోని ఆనందాన్ని, పంచుకోవడం లోని గొప్పదనాన్ని అందరికి చాటాలన్నదే జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ లక్ష్యం.అక్టోబర్ 2 నుండి 8 వరకు ఈ వారాన్ని జరుపుకోవాలని Give india foundation పిలుపు నిస్తోంది.మనం ఇచ్చేది ఏ మూలకు సరిపోకవచ్చు.ఇవ్వడం అన్న భావనగొప్పది.ఇవ్వడం లో ఉన్న ఆనందం గొప్పది.దాన్ని జీవితంలో భాగం చేయాలన్నదే మా ఉద్దేశం అంటారు Give india రూప కర్త వెంకట కృష్ణన్.ఈయన ఐఐఎంలో MBA  చేసారు గత ఏడాది Giveindia తరపున 50,000 దాతల ద్వారా 18. కోట్లు సేకరించారు. ఆయన ఈ సంస్థను తన ఖర్చులకు కూడా అందులో ఒక్క పైసా తీసుకోకుండా నిర్వహిస్తున్నారు కృష్ణన్ .
            ఈ వీక్ లో అందుకునే వారి కళ్ళల్లో ఆనందపు వెలుగులు,అందించే కళ్ళల్లో ఎనలేని సంతృప్తి. ప్రేమ్ జీ ,సచిన్,ద్రావిడ్,శ్రియ,ఫరాఖాన్ ,గోపీచంద్,నాగార్జున,వెంకటేష్ సిద్ధార్ద్ ,విష్ణు,మనోజ్ సైనా ప్రచార రాయబారులుగా వ్యవహరిస్తున్నారు.సూర్య తన పారితోషకంలో 10% ఈ వీక్ లో ఖర్చు చేస్తున్నాడు.కిమ్స్ ,అప్పొలో హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాయి.రహమాన్ joyofgiving గీతానికి రాగాలు కట్టాడు.మణిరత్నం ఓ డాక్యు మెంటరీ తీస్తానన్నాడు.ISB HYD  విద్యార్థులు పాల్గొంటున్నారు.దాతృత్వానికి హృదయమే కొలమమానం .  www.joyofgivingweek.org          
ఒకసారి పై వెబ్సైటు కెల్లి చూడండి.
 పంచుకోండిలా!
1)బట్టలు,పుస్తకాలు,భోజనం,ప్రేమ,అనుభూతులు,గౌరవం పంచండి .
2)కాలనీలో పార్కును శుభ్రం చేయండి .
3)పాదచారులకు లిఫ్ట్ ఇవ్వండి
4)సమస్యల్లో ఉన్న మిత్రునికి ఓ మంచి పుస్తకం ఇచ్చి ధైర్యం చెప్పండి .
5)joyofgiving  గొప్పదనాన్ని వివరిస్తూ మిత్రులకు మెయిల్స్ పంపండి .
6)దూరమైన మిత్రులను దగ్గరికి తీసుకోండి
7)పొగరాని పొయ్యి రూ 200 అవుతుంది.పల్లెల్లో పాత రకం పొయ్యి వాడుతున్న ఓ 5 గురికి వాటిని ఇవ్వండి .
8)మారుమూల పల్లెల్లోని పాటశాలకు వెళ్లి మీ laptap తో పాటాలు చెప్పండి
9)ఓ కాబ్ మాట్లాడుకుని నలుగురు మురికి వాడల పిల్లల్ని ఊరంతా తిప్పండి కార్లో తిరుగుతామని వారు కలలో సైతం ఊహించరు.
10)అమ్మ,నాన్నలను వారి చిన్నప్పటి సంగతులను అడగండి
11)మీ వీధిని ఊడ్చే మున్సిపల్ సిబ్బంది ని ఎంత బాగా శుభ్రం చేస్తున్నారో నని మెచ్చుకోండి . జీవితం లో అదే తొలి ప్రశంస కావచ్చు .
        ఆలోచిస్తే ఇలాంటి idea లు బోలెడన్ని . వాటిల్లో కొన్నిటినయినా అమలు చేయండి .Friendsfoundation   కోరుతోంది ఇదే.
(ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అనుబంధం లోనిది )

Saturday 1 February 2014

విద్యలో ప్రాధమిక అంశాల్లో మీ పిల్లల స్థితి ఎలా ఉంది?

                  తల్లి దండ్రులకు పిల్లల పై ఎన్నో ఆశలు ఉంటాయి.వారి భవిష్యత్తును గురించి ఎంతో ఊహించుకుంటారు. కానీ తమ పిల్లలకు చిన్న చిన్న అంశాలలో ఎంత పట్టు ఉందో తెలుసుకోరు.ప్రాధమిక విద్యలో "ప్రధం" అనే స్వచ్చంద సంస్థ సర్వే వివరాలు ఆశ్చర్యాన్నికలిగిస్తాయి.తరగతి వారీ ప్రమాణాల్లో పిల్లలు వెనుకబడి ఉన్నారని తెలియజేసింది.
         ఫ్రెండ్ ఫౌండేషన్ సంస్థ విద్యార్థులు తమ మాతృ భాష పై మరియు గణితం లోని నాలుగు ప్రక్రియలైన కూడిక తీసివేత,గుణకారం,భాగహారంల పై ఎంత పట్టు కలిగి ఉన్నారనే అంశం పై  దృష్టి పెట్టింది.చదువులో ప్రాధమిక విష యాలను బాగా నేర్పించాలని,అందుకు విద్యార్థులను,ఉపాధ్యాయులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో చిన్న పరీక్షను మా స్వగ్రామమైన సానికవరం primaryschool( gen) లో నిర్వహించగా 3,4,5 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు D.Basha గారు పరీక్ష నిర్వహించారు.తెలుగులో dictation,మరియు లెక్కలలో నాలుగు ప్రక్రియల పై జరిపారు. తరగతికి 5 గురు చొప్పున బాగా వ్రాసిన వారికి బహుమతులను january 26 సందర్భంగా మా అమ్మగారైన ఒద్దుల విజయలక్ష్మి గారితో అందించటం జరిగింది. విద్యార్థులు చాలా వరకు బాగా వ్రాసారు. బాషా గారు బాగా కృషి చేస్తున్నారు.
           మీరు కూడా మీ పిల్లలు చదివే schools  ప్రాధమిక అంశాలపై ఏ మేరకు దృష్టి పెడుతున్నాయో గమనించి వాటి పట్ల విద్యా సంస్థలు కృషి చేసే విధంగా సలహా ఇవ్వండి.ఈ  విషయం పై తల్లిదండ్రులు శ్రద్ధ తీసికొనగలరు.     

Thursday 30 January 2014

HOSTEL విద్యార్థులకు ప్రేరణ సదస్సు

                              Friendsfoundation సంస్థ మొదటి కార్యక్రమం విద్యకు సంబంధించి hostel విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు, విద్య యొక్క  విలువ ను వారు గుర్తించేందుకు,చదువు పై ఇష్టం పెంచుకునే విధంగా ఏర్పాటు చేసింది .ఇది జనవరి 26 తారీకు మధ్యాహ్నం 4:30 నుండి 6:00 గంటల వరకు జరిగింది.
        మార్కాపుర్ లోని. B.C  సంక్షేమ హాస్టల్(బాయ్స్) కరంటు ఆఫీసు దగ్గర ఉన్నది.B. ఏడుకొండలు గారు ఆ హాస్టల్  వార్డెన్.వారు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసారు. పిల్లలంతా ఉత్సాహంగా హాజరయ్యారు.  తల్లి  దండ్రులను వదిలి హాస్టల్ వాతావరణంలో ఉన్న పిల్లలకు ఆప్యాయతతో కూడిన పరిస్థితి ఉండాలి.ఈ  హాస్టల్ లో పిల్లలు ఆనందంగా ఇంట్లో ఉన్నట్లుగా ఉన్నారు.
       మొదట ఈ సంస్థ లక్ష్యాల గురించి పిల్లలకు చెప్పి చదువు యొక్క ప్రాధాన్యత జీవితంలో ఏవిధంగా ఉంది, చదువ వలసిన అవసరం, ఏవిధంగా చదవాలి,చదువుకుంటే భవిష్యత్తు ఏవిధంగా ఉంటుంది ,ఏయే అవకాశాలు ఉంటాయో వివరించటం జరిగింది.ముఖ్యమైన విషయాలను వ్రాసుకున్నారు.
       10 వ తరగతి తర్వాత ఏయే courses ఉంటాయి,ఏవి చదివితే ఏ ఉద్యోగాలు సాధించవచ్చు అన్న విషయాలు వివరించటం జరిగింది.పిల్లలను వారు ఏమి కావాలనుకుంటున్నారో అడగగా చాలా ఉత్సాహంగా తమ లక్ష్యాలను తెలిపారు.  కొందరు పిల్లలు,మా అబ్బాయి స్నేహిత్ ఈ విషయాలన్నీ విని తమ అభిప్రాయాలు  తెలియజేసారు.
                  విద్యావేత్తలు,ఉపాధ్యాయులు ,సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు  మీ మీ ప్రాంతాల్లో ఉన్న hostels ఓ సారి సందర్శించి వారికి మీకు తోచిన సహాయం చేయమని ఈ సంస్థ తరపున కోరుతున్నాము.ఎందు కంటే  సమాజం లోని అత్యంత వెనుకబడిన తరగతుల పిల్లలకు సహాయం చేయటం మన భాద్యత.
   Friends  foundation వ్యవస్థాపకులు  ఒద్దుల రవిశేఖర్  
snehith ,రవిశేఖర్,warden B.ఏడుకొండలు గారు    

 ఆసక్తిగా వింటున్న విద్యార్థులు

Sunday 19 January 2014

FRIENDS FOUNDATION అనే నూతన బ్లాగ్ ప్రారంభం


            భూమి మీద జీవం మనుగడ  సాగించడానికి సూర్యుడే ఆధారం.సమస్త ప్రాణికోటికి వృక్ష జాతికి సూర్యుడే మిత్రుడు.నిరంతరం వెలుగులు చిమ్ముతూ కాంతిని,ఉష్ణ శక్తిని మన కందిస్తున్న సూర్యుడంటే మొదటినుంచి మనిషి కెంతో ఆరాధన.అటువంటి సూర్యుడి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు.తాను ఏమీ ఆశించకుండా ఇవ్వట మే ధర్మంగా గల సూర్య తత్వం ఆదర్శంగా మనిషి తీసుకొంటె ఈ ప్రపంచం ఎం త ఆదర్శవంతంగా మారుతుందో కదా! విశ్వానికి,ముఖ్యంగా మన భూమికి ఆయన స్నేహితుడు.ఆయనను విశ్వామిత్ర గా కూడా భావించవచ్చు . ఇదంతా మనకు ప్రేరణ కలిగించే  కోణంలో ఆలోచిస్తే మన కనిపిస్తుంది.సైన్స్ ప్రకారం అదొక నక్షత్రం.విశ్వ పరిణామ క్రమంలో ఏర్పడిన ఒక మధ్యతరగతి నక్షత్రం.
             ఇక స్నేహితుడు  గురించి ఆలోచిస్తే హితము కోరువాడు అని అర్థం వస్తుంది.ఇతరులకు అపకారం కలిగించ కుండా,అవతలి వారి మేలు కోరుతూ చేతనయితే వీలయినంత సహాయం చేయ గలవాడే స్నేహితుడు.ఈ స్నేహ ధర్మం ప్రకృతి నుండే మనం అర్థం చేసుకోవచ్చు.అందుకే మొదటగా సూర్యుడి గురించి వ్రాసింది.అటు వంటి సూర్య తత్వం,స్నేహ గుణం కలిగిన వ్యక్తుల మధ్య స్నేహం పుడుతుంది వారే స్నేహితులు,మిత్రులు అవుతారు.ఇది వ్యక్తిగత స్థాయిలో ఉంటుంది. దీనిని సమాజానికి విస్తరిస్తె ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుండి వచ్చిందే ఈ
Friendsfoundation.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకునే స్నేహితులు కలిసి సమాజానికి సేవ చేయాలనే సంకల్పా న్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుంది అన్న భావన నుంచి ఉదయించిందే ఈ సంస్థ.సంస్థ అనే కంటే ఇదొక వేదిక .దీనికి అధ్యక్ష కార్యదర్శులేమీ ఉండరు.కేవలం కార్యనిర్వాహకులు మాత్రమే ఉంటారు.ప్రస్తుతం నేను (ఒద్దుల రవిశేఖర్) ఆ బాధ్యతలు చూస్తున్నాను. స్నేహ ధర్మం,సహాయగుణం ఉన్న వారంతా సభ్యులే !
https://www.blogger.com/groups/friendfoundation/
 ఇలా ఎక్కడికక్కడ friendafoundations ఏర్పాటు చేసుకొని ఎక్కువ మంది ఈ మార్గం లోకి రావటానికి ప్రేరణ కలిగించటానికి ఈ బ్లాగ్ ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను . అందరు దీనిని సాదరంగా ఆహ్వానిస్తారని కోరుకుంటూ !
              మీ  ఒద్దుల రవిశేఖర్